Thursday, October 29, 2020

చెరువుల నగరం City of Lake



 చెరువుల నగరం City of Lake
మానవ జీవనానికి, ప్రాణకోటి జీవాలకు నీరు చాలా అవసరం. అయితే ఈ నీరు ఎక్కడినుండి వస్తుంది అనేది ప్రశ్న? వర్షం....!

వర్షం ఆధారంగా నీరు భూమి పైకి చేరుతుంది. భూమిలోకి ఇంకి భూమిలోపలికి చేరుతుంది. మరి వర్షం తర్వాత నీరు కావాలంటే నీరును నిల్వ చేసుకోవాలి. అలా ఆలోచనతోనే “చెరువులు” ఏర్పడ్డాయి. వర్షం ద్వార నీరును చెరువుల్లో Tank నిలువ చేస్తారు.  ఆ నీటిని త్రాగడానికి, పంట పొలాలకు వినియోగిస్తారు.

భారతదేశంలోని గ్రామాలు నీటి కోసం ఎక్కువగా చెరువుల మీదనే ఆధారం.  పూర్వకాలంలో రాజులూ, చక్రవర్తులు, నవాబులు ప్రజల అవసరాల కోసం చెరువులు త్రవెంచేవారు. అందులో మంచి నీటి చెరువులు, ఊర చెరువులు అని రెండు రకాలు.

చెరువులు Cheruvulu :


తెలంగాణాలో ఎక్కువగా గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. అంటే ఒక చెరువు నిండితే, దాని నీరు మరో చెరువుకు అలుగు ద్వరా పోతుంది. అది నిండితే మరో చెరువుకు పోతుంది. దేనినే గొలుసుకట్టు చెరువులు అంటారు. వీటికి అనుబంధంగా కుంటలు, కాలువలు ఉంటాయి. వాటిని కంట్రోల్ చేయడానికి తుములుంటాయి. ఈ విధానం మన తెలంగాణాలో తప్ప ప్రపంచం మొత్తంలో మరెక్కడా కనిపించదు.  వర్షా కాలంలో చెరువులు నిండితే మిగిలిన నీరు బయటకు విడిచి పెట్టడానికి “కలుజులు” ఉంటాయి.  ఇవి నిండిన చెరువులు తెగిపోకుండా కాపాడుతాయి.

చెరువుల నగరం City of Lake

మన హైదరాబాద్ నగరం చుట్టూ సుమారు 3000 నుండి 7౦౦౦  వరకు చెరువులు, కుంటలు, జలాశయాలు ఉన్నాయి. కానీ అవి ఎప్పుడు మనకు కానరావు. అందులో కొన్ని ఎప్పుడో కనుమరుగాయై. వర్షం పడ్డప్పుడే అవి మనకు మునిగిన కాలనీల రూపంలో కానవస్తాయి. అందులో ఇప్పుడు 70 నుండి 500 వరకు ప్రభుత్వ లెక్కలో ఉన్నాయి.  కొన్ని ఇప్పటికి వాటి పేర్లు మాత్రం నిలిచాయి. నవాబ్ సబ్ కుంట, తీగల కుంట, అఫ్జాల్సాగర్, నల్లకుంట,మాసాబ్ ట్యాంక్ ఇవి అప్పటి కుంటలే. ఎన్నో చెరువులు ఆక్రమణలకు, చెత్త వేయడానికి, రియల్ ఎస్టేట్ తో చెరువులను కనుమరుగు చేసి.....నేడు హైదరాబాద్ కు వరదలు రావడానికి కారణాలుగా మారాయి.

 2010 నాటికి 500 సరస్సులు హుడా పరిధిలో ఉన్నాయి. మే 2018 నాటికిహుడా 10 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో ఉన్న 169 సరస్సుల రికార్డును కలిగి ఉంది. వీటిలో 62 సరస్సులు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి.
 వీటిలో చాలావరకు కుతుబ్ షాహీ రాజులూ, నవాబులు హైదరాబాద్ ప్రజల నీటి అవసరాల కోసం నిర్మించబడ్డాయి.

English Translation :

City of Ponds City of Lake

Water is essential for human life and for living things. But the question is where does this water come from? Rain ....!

Water rises above the ground based on rainfall. Into the earth and into the earth. If you want water after rain, you have to store water. With that in mind, "ponds" were formed. Tanks store water in ponds through rain. That water is used for drinking and for crop fields.

Villages in India rely heavily on ponds for water. In ancient times kings, emperors and Nawabs used to dig ponds for the needs of the people. There are two types of fresh water ponds and settlement ponds.

Ponds Cheruvulu:

There are mostly chain ponds in Telangana. This means that if one pond fills up, its water will flow to another pond. If it fills up it will go to another pond. Anything is called chain ponds. These are accompanied by lairs and canals. Sneeze to control them. This policy is not found anywhere else in the world except in our Telangana. If the ponds fill up during the rainy season, there will be "drains" to release the remaining water. These protect the filled ponds from being cut off.

City of Ponds City of Lake :

There are about 3000 to 7000 ponds, lairs and reservoirs around our city of Hyderabad. But they never happen to us. Some of it ever disappeared. When it rains they do not come to us in the form of submerged colonies. Of that, 70 to 500 are now in government accounting. Some still have their names. Nawab Sub Kunta, Thigala Kunta, Afzalsagar, Nallakunta and Masab Tank were the then Kuntas. Many ponds have become the cause of encroachments, dumping of garbage, disappearance of ponds with real estate ..... floods in Hyderabad today.

 As of 2010, 500 lakes are under Hooda. As of May 2018, Hooda has a record of 169 lakes covering more than 10 hectares. Of these, 62 lakes are under government control.

 Most of these were built by the Qutb Shahi kings and Nawabs for the water needs of the people of Hyderabad.

Friday, October 23, 2020

ధైర్యవంతుడే సాధించగలడు...! Only the brave can achieve ...!

పాజిటివ్‌ positive ఆలోచనలు, పట్టుదల ఉన్నవారిదే ఈ ప్రపంచం.  దృఢ సంకల్పంతోపాటు,సహనం ముఖ్యం. ఆ సహనంతో ముందుకు వెళితే ఇక సాధించలేనిది ఏమీ ఉండదు. ఆవేశం అనేది మీ వ్యక్తిత్వాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఆవేశంతో ఏమీ సాధించలేరు! నష్టాలే చవిచూడవలసి వస్తుంది. మనకు ఇష్టమైన పని మనసు పెట్టి చేస్తే తప్పక సఫలురు అవుతారు. ధర్మం, న్యాయంతో నడిస్తే ఎన్ని ఆపదలు వచ్చినా సునాయాసంగా ఎదుర్కొని ముందుకు వెళ్తారనేది సత్యం. ఎన్ని ఆపదలు వచ్చినా ఆదుకునేవారు మీ వెంటనే ఉంటారు. ఆలస్యమైనా విజయం మీదే.

మనశ్శాంతిని మించిన శాంతి ఈ ప్రపంచంలో లేదు. ఒకవేళ అది కరువైతే మీరు ఏ పనీ ఏకాగ్రతతో చేయలేరు. విజయం సాధించలేరు. భావితరాల వారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి. వారు ప్రభావితం కావాలి. అలాంటి  పట్టుదలతో శ్రమించండి. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుందని మీ ముందు తరాల వారు నిరూపించారు.

'డిప్రెషన్‌' పదం మిమ్మల్ని మీ జీవితాన్ని కకావికలం చేస్తుంది. ఎలాగైతే సముద్రంలో డిప్రెషన్‌ వచ్చి తుఫానులా మారి ఎలా అల్లకల్లోలం చేస్తుందో, అలాగే మానవుడు డిప్రెషన్‌కు గురైనప్పుడు దాని ప్రభావం శరీర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

అసాధ్యులు...... సాధ్యులు కావాలి Impossible ...... should be possible 

సాధ్యమైనంత వరకు (Depression)  డిప్రెషన్‌కు గురైనప్పుడు ధ్యాన సముద్రంలో మునిగిపోవాలి. తమకు తాము ఏదో ఒక పనిలో లీనమైపోవాలి. అది మిమ్మల్ని అటాక్‌ చేయకముందే దాన్ని  అధఃపాతాళానికి అణగద్రొక్కండి. అప్పుడే మీరు ఏదైనా సాధించగలరు.  అసాధ్యులు కావద్దు. సాధ్యులు కావాలి. అజేయులుగా మిగలాలి. గజం భూమికోసం పోరాటాలు, జగడాలు జరుగుతున్నాయి. మీరు ఈ ప్రపంచంలో వచ్చినప్పుడు ఆ గజం భూమి తీసుకొచ్చారా? లేదు కదా! మరి ఎందుకు ఈ వైషమ్యాలు.

దేశ భవిష్యత్తు యువతపై..... the future youth of the country

దేశ భవిష్యత్తు ఆ దేశ యువతపై ఆధారపడి ఉంటుంది. కానీ మత్తుకు బానిసై తమ భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకోవద్దు. ఆధునిక యుగంలో ఉన్నాం. సాధించేది ముందు ఎంతో ఉంది.  సాధించవచ్చు- శాసించవచ్చు అనే సంగతిని గుర్తుంచుకోండి.

ముందుగా మీరు ఎవరో ఒకరిని ఆదర్శంగా తీసుకోవాలి. ఒక నాయకున్నో, వైజ్ఞానికున్నో లేదా సక్సెస్‌ వ్యాపారవేత్తనో మీకు నచ్చిన వారినెవరినైనా తీసుకుని ఆదర్శంగా తీసుకుని సాగిపోతే మీరు అజేయులుగానే మీ జీవన ప్రస్థానం ముగిస్తారనేది వాస్తవం. అనామకులుగా మీ ప్రస్థానం ముగించకండి. ఆకాశమే హద్దుగా చెలరేగవచ్చు. ఆ శక్తి ఇచ్చాడు దేవుడు మానవునికి. మిమ్మల్ని మీరు గుర్తించుకోండి.      - అజ్మత్‌ ఖాన్‌, హైదరాబాద్‌

 

English Translation :

Only the brave can achieve ...!

This is a world of positive thoughts and perseverance. In addition to determination, patience is important. Going forward with that patience there will be nothing more unattainable. Anger can seriously damage your personality. Nothing can be achieved with rage! Will have to bear the losses. We must succeed if we keep in mind our favorite work. The truth is that if you walk with virtue and justice, you will face any dangers and move forward with ease. No matter how many dangers come, those who support you will be with you immediately. Late success is yours.

There is no peace in this world beyond peace of mind. If it is dry you can not do any work with concentration. Can not succeed. Future generations should take you as an ideal. They need to be affected. Work hard with such perseverance. Your predecessors have proven that hard work pays off.

The word 'depression' can make your life miserable. However, depression in the ocean can turn into a hurricane and can have a devastating effect on human organs when it comes to depression.

Impossible ...... should be possible

Whenever possible you should have all four of these components in place for launch to maximize profits. They have to immerse themselves in something. Destroy it into the abyss before it attacks you. Only then can you achieve anything. Not impossible. Want possible. Must remain invincible. Fights and battles are going on for yard land. Did you bring that yard land when you came into this world? Nope! And why these conflicts.

On the future youth of the country .....

The future of the country depends on the youth of that country. But do not let the drug addicts ruin their future by hand. We are in the modern age. There is so much to achieve before. Remember that achievable- can be ruled.

First you have to take someone as an ideal. The fact is that you're going to end your life as an invincible if you take on the ideal of being a leader, a scientist, or a successful entrepreneur. Do not end your reign as anonymous. The sky is the limit. God gave that power to man. Identify yourself.

Tuesday, October 20, 2020

హైదరాబాద్‌ను కాపాడుతున్న మూసీ...!

జీవకోటి మనుగడకు నీరు చాలా అవసరం. అందుకే నగరాలన్నీ నదుల పరివాహక ప్రాంతాలలోనే వెలుస్తాయి.  జీవ నదులైన గంగా, యమునా నది పరివాహక ప్రాంతాలలో ఎన్నో నగరాలు వెలిసాయి.

హైదరాబాద్‌ నగరం మధ్య నుండి ప్రవహించేదే మూసీ నది

కృష్ణా ఉపనదులలో మూసీ నది ఒకటి. హైదరాబాద్‌ నగరం మధ్య నుండి ప్రవహిస్తూ ,  సుమారు 120 కిలోమీటర్లు ప్రవహించి నల్గొండ జిల్లాలో కృష్ణా నదిలో కలుస్తుంది. 1908లో మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు  హైదరాబాద్‌ నగరం అతలాకుతలమైంది.  అప్పటి నుండే ప్రణాళికాబద్ధంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చెయాలని వరదల నుండి నగరాన్ని కాపాడాలనే ఉద్దేశ్యంతో  హైదరాబాద్‌ నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌  సాంకేతిక నిపుణుడు అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య నాయత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు.  1920లో మూసీ నదిపై నగరానికి వెలుపల ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ అనే రెండు జలాశయాలు నిర్మించారు. ఈ రెండు జలాశయాల వల్లే మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్‌ నగరాన్ని కాపాడుతూ, నగరానికి అవసరమైన మంచి నీటి అవసరాన్ని తీరుస్తున్నాయి.

అయితే.... మూసీ మురికి కాలువ

నేడు మూసీ నది అంటేనే  మురికి కాలువ అనే భ్రమలో నగరవాసులు ఉన్నారు. ప్రస్తుతం దాని స్థితి ఆ విధంగా తయారైంది. హైదరాబాద్‌ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో పరిశ్రమలలోని వ్యర్ధ నీరంతా ఈ మూసీలోనే వదులుతున్నారు.  దీంతో ఇది ఒక మురికి కాలువ స్థాయిలో చేరిపోయింది.

వర్షం అంటేనే భయం

ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో నగర వెలుపల ఉన్న చెరువులు నిండి...నీరు వెళ్ళే దారిలేక కాలనీల వైపు మళ్ళడంతో హైదరాబాద్‌లో అపార ఆస్తి నష్టంతో పాటు, ప్రాణ నష్టం కూడా జరిగింది. నగర ప్రజలు వర్షం అంటేనే భయపడుతున్నారు.

Wednesday, October 14, 2020

ఆసియాలోనే పెద్ద చెరువు నిండింది Biggest Lake in Asia

మనం ఇప్పుడు ఆసియాలోనే పెద్ద చెరువుగా పిలువబడే కంభం చెరువు గురించి తెలుసుకోబోతున్నాము.

కంభం చెరువు (Cumbum Lake)


ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కంభం గ్రామానికి ఆనుకొనే ఉంది ఈ చెరువు. ఇది
15 శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలోని మహారాణి వరదరాజమ్మ గారు గుండ్లకమ్మ నది ఆనుకొనే ఈ చెరువు నిర్మించారని చరిత్ర చెబుతుంది. ఇది ఆసియాలోనే పేరుగాంచిన పెద్ద చెరువులలో ఇది ఒకటి . దీని చుట్టూ సహజ సిద్ధమైన కొండలు ఉండడంతో ఒక ఆనకట్టతో దీని నిర్మాణం జరిగింది. అప్పట్లోనే ఈ చెరువు ఆనకట్ట ఎత్తు 57 అడుగులు. అందువల్ల ఇప్పటికీ ఇది చెక్కుచెదరకుండా చెరువు నిండడానికి ఉపయోగపడుతుంది.

పిక్నిక్‌ స్పార్ట్ (Picnic Spot)

ఆసియాలోనే పెద్ద చెరువు కాబట్టి ఇక్కడికి పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు.  ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఈ చెరువు కు  కాస్త నీరు చేరుతుంది. అయితే ఈ సంవత్సరం  నిండుకుండలా నిండిపోవడంతో చూడడానికి సందర్శకులు వేల సంఖ్యలో వస్తున్నారు. అయితే ప్రభుత్వపరంగా ఎటువంటి వసతులు లేకపోయినప్పటికి సందర్శకులు తాకిడి ఎక్కువే. ఇక్కడికి చేరడానికి  సమీపంలో గుంటూరు-నంద్యాల రైల్వే లైన్‌లో  కంభం రైల్వేస్టేషన్‌, బస్‌ ద్వారా కూడా చేరుకోవచ్చు.

నిండుకుండలా మారిన కంభం చెరువు (Fulfill Cumbum Lake)

ఈ సంవత్సరం విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కంభం చెరువు నేడు నిండుకుండలా మారింది. సందర్శకులు ఈ ఆహ్లాదకర దృశ్యాన్ని చూడడానికి వేల సంఖ్యలో వస్తున్నారు.


ఈ చెరువు నిండడం అంటే... కంభం చుట్టుప్రక్కల మండలాల రైతులకు ఎంతో సంతోషకరమైన వార్త. మీకు వీలుంటే వీకెండ్ లో ఒకసారి వెళ్లి రావచ్చు. 

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే కామెంట్ చేయండి. షేర్ చేయండి.

Tuesday, October 13, 2020

జగమంతా స్మార్ట్

 ఒకప్పుడు ఎవరినైనా చూసినట్లయితే ఆహా ఎంత స్మార్ట్ గా ఉన్నాడు అంటాము.. తర్వాత స్మార్ట్ ఫోన్ వచ్చింది. ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ కావాలి అని అనుకుంటున్నారు. ఇదివరకు ఈ స్మార్ట్ ఫోన్ కొంతమంది వరకే పరిమితమై ఉండేది అది కూడా ధనవంతుల్లో సెలబ్రిటీలలో మాత్రమే. 

అయితే ప్రస్తుతం స్మార్ట్ టీవీల యుగం ప్రారంభమైంది. ఈ ప్రకటన చూసిన ఏ పత్రిక చూసినా స్మార్ట్ టీవీ ల ప్రకటనలే వస్తున్నాయి. వాట్ స్మార్ట్ ఫోన్ లో స్థానంలో ఎప్పుడు స్మార్ట్ టీవీలు ప్రతి ఇంట్లో దర్శనమిస్తున్నాయి. ఇందులోనే బ్రౌజర్ గూగుల్ యూట్యూబ్ ఫేస్బుక్ ప్రతిదీ చూసుకోవడానికి ఈ స్మార్ట్ టీవీలు చాలా అవసరం. దీంతో డాటా స్మార్ట్ ఫోన్ లోకి లకు మాత్రమే కాకుండా  టీవీ లో కూడా అవసరం అయ్యింది. ప్రతి ఇంట్లో నాలుగు ఫోన్లు ఒక స్మార్ట్ టీవీ దీంతో ఖర్చు పెరిగి చాటంత అవుతుంది.

ప్రస్తుత మహమ్మారి కరోనా వల్ల కాలేజీలు స్కూల్ ఆఫీసులు లాక్ డౌన్ ప్రకటించడంతో ఇంటి వద్దనే అందరూ డాటా రూపములో డబ్బును ఖర్చు చేస్తున్నారు. 

స్కూల్లో కాలేజీలు డిజిటల్ క్లాసులు అని పిల్లలతో స్మార్ట్ ఫోన్ లను స్మార్ట్ టీవీ లను చూసే విధంగా అలవాటు ప్రారంభించాయి. ఎప్పుడు టివి ముఖం చూడని వారు కూడా స్మార్ట్ టీవీలు తెచ్చి ఇంటిలో పెట్టుకోవడం జరుగుతుంది. ఇది ఒక విధంగా డిజిటల్ మార్కెటింగ్ పెరిగిందనే చెప్పవచ్చు. సెల్యులార్ కంపెనీలు డాటాను పోటీపడి ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. 

నేడు అత్యవసరం స్థానంలో స్మార్ట్ ఫోన్ స్మార్ట్ టీవీ సంపాదించాలి అని అనుకోవచ్చు. నువ్వు లేనిదే నేను లేను అని ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ లేనిదే ఉండలేకపోవడం ఆశ్చర్యం అనిపిస్తుంది. రాబోయే డిజిటల్ యుగంలో వీటి తరువాత ఏది ఆక్రమిస్తోంది ఇక కాలమే చెప్పాలి.

Tuesday, October 6, 2020

సంపాదన స్టాక్‌ మార్కెట్ లో సాధ్యమేనా...?

Earn money in stock market స్టాక్‌ మార్కెట్ లో డబ్బు ఒకరి నుంచి మరొకరికి బదిలీ అవుతుంది. అంటే ఒకరి లాభం, మరొకరికి నష్టం. బ్రోకరేజ్‌ ఛార్జీలు, జి.ఎస్‌.టి. తదితర చార్జీలు పోగా, లాభం గడించడం అందరికీ సులభ సాధ్యం కాదు. స్టాక్‌ మార్కెట్లోకి ప్రవేశించే వారికి 'మనీ మేనేజ్మెంట్' బాగా తెలియాలి. ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ కావాలి, స్టాప్‌లాస్‌, టార్గెట్  తెలిసి వుండాలి.

స్టాక్‌ మార్కెట్ లో ఎవరైనా సరే తన స్థాయికి తగినట్లు స్వంత డబ్బుతో దిగాలి. ఎట్టి పరిస్థితిలోనూ అప్పు తెచ్చి పెట్టకూడదు. మార్కెట్  అనేది జూదం కాకపోయినా, రిస్క్ తో కూడుకున్నది.

స్టాక్‌ మార్కెట్ లో మదుపు చేసేవారు రెండు రకాలుగా ఉన్నారు. ఒకరు ట్రేడర్‌, మరొకరు ఇన్వెస్టర్‌. తక్కువ కాలంలో లాభనష్టాలు చూసుకునేవారు ట్రేడర్‌. ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టి  లాభనష్టాలు స్వీకరించేవారు ఇన్వెస్టర్‌. తామేమీ కావాలనుకుంటున్నామో (ట్రేడర్‌ లేక ఇన్వెస్టర్‌) అనేది ఎవరికీ వారు స్వతహాగా నిర్ణయించుకోవాలి. పెట్టుబడి పెట్టేవారు ఫండమెంటల్‌ ఎనాలిసిస్‌, టెక్నికల్‌ ఎనాలిస్‌ తెలిసి ఉంటే మంచిది.

మార్కెట్ లో స్టాక్‌ ధర హెచ్చుతగ్గులు, ఆశ, భయంపైనే ఆధారపడతాయి. పెట్టుబడిదారులు మినిమమ్‌ లాస్‌, మ్యాగ్జిమమ్‌ ప్రాఫిట్ సూత్రాన్ని పాటించాలి. అంటే తక్కువ నష్టంతో వేగంగా బయటపడటం, ఎక్కువ లాభాన్ని తీసుకోవడానికి వేచి  ఉండే సూత్రం. స్టాక్‌ మార్కెట్ పైనే పూర్తిగా ఆధారపడి ఉండం అంత మంచిది కాదు. మదుపరులు ఏదైనా పనిచేసుకుంటూ సైడ్‌ బిజినెస్‌లా స్టాక్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ చేయాలి.

ఒకదేశ ఆర్థిక పరిస్థితిని చాటేది ఆ దేశ స్టాక్‌ మార్కెట్ లే! ఏ పెట్టుబడిలోనైనా రిస్క్‌ అంతో ఇంతో ఉంటుంది. మీరు ఎంతమేరకు రిస్క్‌ తీసుకోగలరో చూసుకోవాలి. మనకు వచ్చే ఆదాయం రెండు రకాలు.

ఒకి నిష్క్రియ ఆదాయం (పాసివ్‌ ఇన్‌కమ్‌) అంటే బ్యాంకు వడ్డీలు, ఇంటి అద్దెలు. మనం పనిచేయకపోయినా అవి  ఆదాయాన్ని ఇస్తాయి. మీరు ఎంత కష్టపడితే అంత డబ్బు వచ్చే ఆదాయాన్ని క్రియాత్మక ఆదాయం (లినియర్‌ ఇన్‌కమ్‌) అంటారు. దీనికి ఉదాహరణ ట్రేడింగ్‌ అని చెప్పవచ్చు. ఇవికాక లీవరేజ్‌ ఇన్‌కమ్‌ అని కూడా వేరే మార్గాలున్నాయి. అవి ఫ్యూచర్‌ & ఆప్షన్స్‌ ద్వారా వస్తుంది. కొంత కష్టపడితే లాటరీ ద్వారా వచ్చే ఆదాయాన్ని విండ్‌ఫాల్‌ (గాలివాటం) ఆదాయం అంటారు.

స్టాక్‌ మార్కెట్ ఎంతగా డబ్బు సంపాదించవచ్చో, అంతే స్థాయిలో పోగొట్టుకొనే ఛాన్స్‌ ఉంది. స్టాక్‌ మార్కెట్  కొన్ని రోజులు అప్‌ట్రెండ్‌, మరికొన్ని రోజులు డౌన్‌ ట్రెండ్‌, ఇంకా కొన్ని రోజులు రేంజ్‌ బౌండ్‌లో ట్రేడవుతుంటుంది. ఇందులో విజయం సాధించాలంటే నాలెడ్జ్‌, ఇన్వెస్ట్‌మెంట్, స్కిల్‌, పేషన్స్‌ అనేవి చాలా ముఖ్యం.

ముందుగా మీ ఆదాయంపై రాబడి (రిటర్న్‌ ఆన్‌ ఇన్వెస్ట్‌మెంట్)ను మీరు రోజువారీగా నోట్స్ రాసుకోవాలి. రిస్క్‌ రివార్డ్‌ సూత్రం కూడా పాటించాలి. ఏమీ తెలియకుండా స్టాక్‌ మార్కెట్ లోకి వస్తే... ఆరిపోవడం ఖాయం.

కొత్తగా ఇందులోకి వచ్చేవారు స్టాక్ మార్కెట్  పదజాలం కూడా తెలిసి ఉండాలి. ఇది ఒక మహాసముద్రం. ప్రవేశం సులభమే, కానీ లాభాలు గడించడం అంత సులభం కాదు. ఇందులోకి వచ్చేవారు కనీస మూలధనం మొత్తంతో వస్తేనే ఏమైనా సాధించవచ్చు. ఇందులో వచ్చేవారికి పైన చెప్పినట్లు పెట్టుబడి, తెలివిసహనం, నైపుణ్యం చాలా అవసరం.... సో... బెస్ట్‌ ఆఫ్‌ లాక్‌!                                                                           - అశోక్‌

Saturday, October 3, 2020

'అబ్‌ సీన్ పల్టేగా....'

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న  రియాల్టీ షో, సల్మాన్‌ఖాన్‌ హోస్ట్ గా ఉన్న బిగ్‌బాస్‌-14 'అబ్‌ సీన్‌ పల్టేగా....' అంటూ ఛానల్ కలర్స్ లో  ప్రారంభం.

ప్రతి సంవత్సరం టీవీ ప్రేక్షకుల 100% ఎంటర్టైన్మెంట్  అందిచ్చే షో ఎదైనా ఉందంటే అది బాలీవుడ్‌ మెగాస్టార్‌ సల్మాన్‌ ఖాన్  బిగ్‌బాస్‌ షో.

సుమారుగా 3 నెలలపాటు  ప్రేక్షకులను టీవీ ల ముందు కూర్చోబెట్టే షో ఏదంటే అది బిగ్‌బాసే. ఈ షో కంటెస్ట్‌ ఎవరా... అంటే ..?

Friday, October 2, 2020

డిజిటల్ వైపున ప్రజలు

ప్రపంచం నేడు కరోనాతో పోరాడుతుంది. ప్రజలు తమ జీవితాలను రక్షించుకోడానికి బాహ్య సమాజం నుండి దూరమై డిజిటల్‌ రంగానికి దగ్గరవుతున్నారు. నిజం! మీరు చదువుతున్నది వాస్తవం. ప్రపంచం నేడు క్రమ క్రమంగా డిజిటలైజ్‌ అవుతుంది. ఒక్క క్లిక్‌ తో విశ్వవ్యాప్త సమాచారం మన ముందుకు వస్తుంది.

ఇది అకస్మాత్తుగా జరిగింది కాదు. ఇందులో ఎందరో మేధావులు రాత్రి-పగలు కష్టపడి పనిచేస్తున్నారు. నేడు చట్ట సభలలోని  నాయకుల ప్రసంగాల నుండి, వేల సంవత్సరాల పురాతన గ్రంథాలు కూడా డిజిటలైజ్‌ చేయబడుతున్నాయి.
అయితే.... అన్ని రంగాలు డిజిటలైజ్‌ కావడంతో మరి ఉద్యోగాలు అంటారా? ఈ డిజిటలైజ్‌ రంగంలో కూడా వేల ఉద్యోగాలు నిరుద్యోగుల పాలిట వరంగా మారాయి. ఇప్పుడు మార్కెటింగ్, ప్రభుత్వ పాలనాపరమైన సేవలు అన్ని డిజిటలైజ్‌ కావడంతో ప్రజలు కూడా వీటితో దోస్తి చేయక తప్పడం లేదు.

Thursday, October 1, 2020

స్వతంత్ర దేశం కోసం అహింస ఉద్యమం

నాటి స్వాతంత్రంలో అందరూ భాగస్వాములయ్యారు.... స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు... తెల్లదొరలను తరిమి కొట్టేందుకు... అందరూ ఒక్కటయ్యారు... ఒక్కటే వాదం, ఒక్కటే నినాదం... ఇలా భారతదేశం ఒక్కటైన తరుణంలో... అనేక మంది తమ తమ ఆలోచనలతో ఉద్యమంను ముందుకు నడుపుతూ ఉండగా... బారిస్టరు (అంటే ఇప్పటి లాయర్ చదువు) పూర్తి చేసుకున్న మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ తనదైన ప్రతేక శైలిలో అహింసా వాదాన్ని ముందుకు తీసుకువచ్చారు.

కేవలం కొట్లాటతోనే కాదు... శాంతి యుతంగా కూడా మన నిరసనలను వ్యక్తం చేయొచ్చని తెలిపారు. ఇందులో భాగంగానే   1930 ఉప్పు సత్యాగ్రహం చేశారు అహ్మదాబాద్ నుండి అరేబియా సముద్రం వరకు సాగిన ఈ ర్యాలీలో లక్షల మంది పాలుపంచుకోగా గాంధీ గారితో పాటు 60వేల మందిని అరెస్టు చేయడం కూడా జరిగింది. ఆ తరువాత స్వదేశీ ఉద్యమం జరిగింది. అంటే విదేశీ  వస్తు బహీష్కరణ అంటే భారతదేశంలో తయారు చేసిన వస్తువులను మాత్రమే వినియోగించాలి. దీని ద్వారా ఆర్ధికంగా భారతదేశ ప్రజలను, భారతదేశాన్ని ముందుకు నడిపేందుకు ఆయన శ్రమించారు. 
1869 అక్టోెబర్ 02న జన్మించిన మొహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ దేశానికి దిశా నిర్దేశం చేసి శాంతీయుత మార్గం చూపి మహాత్మ గాంధీగా మారారు. కొన్ని కోట్ల మంది ప్రజలకు దిక్సూచిగా మారారు.                        - వసీం

స్టూడెంట్స్ పై ...Comment?


 

More Post's...